వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 13: కేయూ తెలుగు విభాగం అధ్యాపకురాలు, కవి, రచయిత్రి, సాహిత్య ఉద్యమకారిణి ప్రొఫెసర్ శోభారాణి(45) ఆదివారం మరణించగా.. ఆమె పార్థివదేహాన్ని వరంగల్ కాకతీయ వైద్య కళాశాల అనాటమీ విభాగానికి సోమవారం ఆమె కుటుంబ సభ్యులు అప్పగించారు. మరణానంతరం తన పార్థివదేహాన్ని కేఎంసీకి అప్పగించాలన్న ఆమె కోరిక మేరకు భర్త రమేశ్ తదితరులు కళాశాలకు అందజేశారు.