హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో నిర్వహించారు. జయశంకర్ సార్ విగ్రహానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహముద్ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, లక్ష్మారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కార్పొరేషన్ల చైర్మన్లు విద్యాసాగర్, నగేశ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు రూప్ సింగ్ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.