హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలుచేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరైంది కాదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగం ఇచ్చిన హకు అని అన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
ప్రైవేటు వర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభు త్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేస్తున్న ఫీజులు, ఫీజు రీయింబర్స్మెంటు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇండ్ల ప్లాట్లకు రిజిస్ట్ట్రేషన్ అయినట్లు భూములను ధరణిలో చూపించినా ప్రైవేటు యూనివర్సిటీకి అనుమతిని ఇచ్చారని వీటిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. యూనివర్సిటీకి అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వ్యవహారం వల్ల గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని రేవంత్రెడ్డి గుర్తుచేశారు. సర్వ శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ)లో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఇప్పటిదాకా జరిగిన నిధుల వినియోగంపైనా సమగ్రంగా విచారణ జరిపి, నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.