నల్లగొండ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత రాష్ట్రంలో అర్చకులకు తగిన ఆదరణ, గౌరవం లభిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండ లోని టీటీడీ కళ్యాణ మండపం లో శోభ కృత్ నామ సంవత్సరానికి గాను 18 వ పంచాంగం తో పాటు పుష్కర పంచాంగాన్ని మంత్రి ఆవిష్కరించారు.ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు అర్చకులకు, గ్రామాల్లో వ్యవసాయము చేసి వారికి పిల్లను ఇవ్వాలంటేనే భయపడే రోజులు ఉండేవని అన్నారు.
కేసీఆర్ తీసుకువచ్చిన పథకాలు , విప్లవాత్మక మార్పుల వల్ల విదేశాల్లో ఉన్న అర్చకులు స్వదేశానికి వస్తున్నారని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగులు సైతం తమ ఉద్యోగాన్ని వదిలేసి తమ గ్రామాలల్లో వ్యవసాయం చేసుకోవడానికి వస్తున్నారని తెలిపారు.
అభివృద్ధి లో దేశంలో నే తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిన నేపథ్యంలో లో కేసీఆర్పై కక్ష కట్టి , మతాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి యత్నిస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, దైవజ్ఞ శర్మ, మోహన్ శర్మ , అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉపేంద్ర శర్మ, అర్చక ఉద్యోగ సంఘం అధ్యక్షులు కృష్ణమాచార్యులు , మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.