హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సవరణ బిల్లుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగం తర్వాత కేంద్రం కుట్రలు బట్టబయలయ్యాయని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల సంఘం (1535) అధ్యక్షుడు ఎంఏ వజీర్ అన్నారు. బిల్లుపై సీఎం కేసీఆర్ చక్కగా వివరించారని, కోట్లాది రూపాయల ఆస్తులున్న విద్యుత్తు సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు ఎట్ల కట్టబెట్టే కుట్ర చేస్తున్నారో తెలియజేసినందుకు ఆయన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.