యాదాద్రి, డిసెంబర్ 5: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రానికి ఈ నెల 29న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నట్టు సమాచారం. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె తొలిసారిగా తెలంగాణ రాష్ర్టానికి శీతాకాలపు విడిదికి రానున్న నేపథ్యంలో యాదగిరీశుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు తెలిసింది.