హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ (Dundigal) ఎయిర్ఫోర్స్ అకాడమీలో (Air Force Academy) కంబైన్డ్ గ్రాడ్యేషన్ పరేడ్ను (Combined Graduation Parade) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి ముర్ము.. పరేడ్కు రివ్యూయింగ్ అధికారిగా రావడం ఇదే మొదటిసారి. క్యాడెట్ల పరేడ్, విన్యాసాలు ఆహుతులను అలరిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు.
ఎయిర్ఫోర్స్ అకాడమీలో మొత్తం 119 ఫ్లయింగ్ ఎయిర్ ట్రైనీలు, 75 మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనీ క్యాడెట్లు శిక్షణ పొందారు. మరో 8 మంది క్యాడెట్లు ప్రత్యేక శిక్షణ పూర్తిచేసుకున్నారు. వారిలో ఇద్దురు వియత్నాం దేశానికి చెందిన క్యాడెట్లు కాగా, మిగతా ఆరుగురు నేవీ, కోస్ట్గార్డ్కు చెందినవారు.
#WATCH | President Droupadi Murmu reviews the Combined Graduation Parade at the Air Force Academy in Dundigal, Telangana pic.twitter.com/raxZtMMzsd
— ANI (@ANI) June 17, 2023
#WATCH | Combined Graduation Parade underway at the Air Force Academy in Dundigal, Telangana
President Droupadi Murmu to review the Parade. pic.twitter.com/TyqQW8waWU
— ANI (@ANI) June 17, 2023