హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శుక్రవారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్భవన్కు చేరుకొని, రాత్రి అక్కడే బస చేస్తారు.
శనివారం ఉదయం దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు రీవ్యూయింగ్ ఆఫీసర్గా హాజరవుతారు. పరేడ్ అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతారు.