హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగా ణ) : రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో నిర్వహిస్తున్న 83వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ (ఏఐపీవోసీ)లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వీ నరసింహాచార్యులు పాల్గొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సుకు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, మండలి చైర్మన్లు, అసెంబ్లీ కార్యదర్శులు హాజరయ్యారు.