మల్యాల : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈ నెల 22 నుంచి 26 వరకు హన్మాన్ పెద్ద జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలకు రావాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆలయ అధికారులు ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందించగా.. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశం, పాలకమండలి చైర్మన్ తిరుక్కోవేల మారుతిస్వామి, ఆలయ పర్యవేక్షకులు సునీల్, వేదపండితులు రాజేశ్వర శర్మ, పెద్దన్న శర్మ పాల్గొన్నారు.