కొడకండ్ల : ఆ నాటి మహనీయుల పోరాటం, తాగ్యాల ఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని.. ఆ స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజెప్పేందుకే ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వేడుకల్లో భాగంగా శనివారం జనగామ జిల్లా కొడకండ్ల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కెసీఆర్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు.
ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయడం, మహనీయుల త్యాగాలను స్మరించుకునేలా 15 రోజులపాటు రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించి స్వతంత్ర స్ఫూర్తి, దేశభక్తి, సమైక్యతా భావాన్ని ప్రతి ఒక్కరిలో కలిగేలా ఉత్సవాలను పట్టణాలు, పల్లెపల్లెగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అహింసా మార్గంలో ఆనాడు గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభభాయి పటేల్ సాధించిన భారత స్వతంత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ముందు ముందుందన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి మంత్రి బహుమతులు ప్రదానం చేశారు.