మెదక్ : లోక్సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్ఎస్(BRS) పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగు తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం మెదక్ లోక్సభ(Medak Lok Sabha) నియోజకవర్గం సన్నాహాక సమావేశం మాజీ మంత్రి హరీశ్ రావు(Harish rao) నేతృత్వంలో సంగారెడ్డిలో ప్రారంభమైంది. ఈ సమా వేశంలో మెదక్ లోక్సభ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన నేతలంతా హాజరయ్యారు.
లోక్సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై చర్చిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా హరీశ్రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ బీఅర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.