కొడకండ్ల, ఫిబ్రవరి 1: చరిత్ర పూర్వయుగం నాటి బృహత్ శిలాయుగపు మానవ ఆవాసాలు, వారి సమాధులు జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగుల గ్రామంలో ఇప్పటికీ కనిపిస్తున్నాయని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన రేగులగుట్టను పరిశీలించి.. డోల్మెన్ రకపు సమాధిని పల్లె ప్రకృతి వనంలో భద్రపరిస్తే భవిష్యత్ తరాల వారు చరిత్రను తెలుసుకొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.