హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): అద్దె గర్భం (సరోగసీ), పునరుత్పత్తి సహాయక సాంకేతికత (ఏఆర్టీ) సేవలను అందించే క్లినిక్లు తప్పనిసరిగా తమ సంస్థల పేర్లను నమోదు చేసుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఆర్టీ బ్యాంకు/లెవల్-1 క్లినిక్ కోసం రూ.50 వేలు, లెవల్-2 క్లినిక్/సరోగసీ క్లినిక్ రిజిస్ట్రేషన్ కోసం రూ.2 లక్షల ఫీజును చెల్లించాల్సి ఉంటుందని ఆ శాఖ అడిషనల్ సెక్రటరీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు registry. artsurrogacy.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. నమోదు చేయించుకోని క్లినిక్లపై ఆయా చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.