హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఇన్చార్జిగా అమిత్ షా వ్యవహరించనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. అమిత్ షా గురువారం హైదరా బాద్ చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు భాగ్యలక్ష్మి గుడిలో ప్రత్యేక పూజ లు చేస్తారని వెల్లడించారు. అనంతరం కొంగరకలాన్లో నిర్వహించనున్న పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు.
మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల నిమిత్తం 90 రోజుల యాక్షన్ ప్లాన్ను రూపొందించనున్నట్టు వెల్లడించారు. ఫిబ్రవరి చివరలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూ ల్, మార్చిలో ఎన్నికలు ఉంటాయని చెప్పారు. జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నామని, హిందువులంతా ఏదో ఒక రూ పంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించి ప్రకాశవంతం చేసుకోవాలని కోరారు.