నందికొండ, నవంబర్ 15: నందికొండ హిల్కాలనీలో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టుపై తీసిన డాక్యుమెంటరీకి జాతీయ పురస్కారం దక్కడంపై ఆ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య హర్షం వ్యక్తం చేశారు.
డీఎస్ఎన్ ఫిలిమ్స్ అధినేత దూలం సత్యనారాయణ ఆదివారం కోల్కతాలో జరిగిన పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రపంచ సమాచార శిఖరాగ్ర సదస్సులో జాతీయ వార్షిక పురస్కార ప్రదానోత్సవ సభలో ఈ అవార్డు అందుకున్నారని ఆయన పేర్కొన్నారు.