అబిడ్స్, డిసెంబర్ 2: తెలంగాణలో మాదిరిగానే అన్ని రాష్ర్టాలలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ లభించడం ఖాయమని వక్ఫ్బోర్డు డైరెక్టర్ మసియుల్లా ఖాన్, టీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు ఎంకే భద్రుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని నెల్లూరులోని రహ్మతాబాద్ షరీఫ్ దర్గాలో వారు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకొంటున్నారని వారు తెలిపారు.