హైదరాబాద్, జూన్ 19: ‘కశ్మీరీ పండిట్లపై మతం పేరుతో జరిగిన హింస తప్పే. గో రక్షణ పేరుతో జరిగే హింస కూడా తప్పే. మనం మంచి వ్యక్తిగా ఉంటే ఇతరులను బాధించం. లెఫ్టిస్టు అయినా.. రైటిస్టు అయినా మనం మంచిగా ఉండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు’ అంటూ నటి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగిన నేపథ్యంలో నటుడు ప్రకాశ్ రాజ్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ‘మానవత్వమే అన్నింటికంటే ఉన్నతమైనది. మేం నీ వెంట ఉన్నాం’ అని ట్వీట్ చేశారు.