KA Paul | నీలగిరి, మార్చి 23: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా.. ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మనోరమ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు పైసలు రూ.5 వేల కోట్లు పొంగులేటి ఖాతాలో వేశారని, ఆయన ఏక్నాథ్ షిండే కానున్నారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో నీటి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తెసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని చోట్లా ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని, విశాఖపట్నం నుంచి తాను బరిలో ఉంటానని చెప్పారు.