హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్లో నిర్మాణాలున్నాయంటూ జీహెచ్ఎంసీ జారీచేసిన నోటీసుల వ్యవహారంలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు హైకోర్టులో ఊరట లభించింది. రాజ్భవన్ రోడ్డు సర్వే నం.22లోని ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ఈ నిర్మాణాలపై వారంపాటు కఠినచర్యలు తీసుకోరాదని జీహెచ్ఎంసీతోపాటు హైడ్రాను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. సోమాజిగూడలోని బహుళ అంతస్తుల భవనం నిర్మాణానికి సంబంధించి జీహెచ్ఎంసీ ఇచ్చిన షోకాజ్ నోటీసును రద్దు చేయాలని కోరుతూ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపించారు.