హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఉదయం 9 గం టల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లల్లో పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు తమ కాలేజీ లాగిన్ ఐడీ నుంచి వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లు పొందవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.