ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం ఫీడర్లోని విద్యుత్తు స్తంభాలు ముంపునకు గురయ్యాయి. శనివారం విద్యుత్తుశాఖ ఏడీ విజయరాజు, ఏఈ ప్రశాంత్ సిబ్బందితో కలిసి నాటు పడవల్లో ముంపు ప్రాంతాలకు వెళ్లి, మరమ్మతులు చేసి కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా విద్యుత్తు అధికారులను ప్రజలు అభినందించారు.
–వాజేడు