హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఈనెల 12న భారత జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన మహా ధర్నా వాయిదా పడింది. బీసీ హకుల సాధనతోపాటు అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న డిమాండ్లతో చేపట్టాలనుకున్న ధర్నాను అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వాయిదా వేసినట్టు యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలిపింది. త్వరలో మరో తేదీని ప్రకటిస్తామని, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని యూపీఎఫ్ నాయకులు తెలిపారు.