హైదరాబాద్, డిసెంబర్11 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం విద్యుత్తు ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 34పై విచారణను సుప్రీంకోర్టు జనవరి 9వ తేదీకి వాయిదా వే సింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 34 ను కొట్టివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్పై మంగళవారం విచారణ జరగాల్సి ఉండగా, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడినందున విచారణను వాయిదా వేయాలని కోరారు.