హైదరాబాద్, ఆగస్టు19 (నమస్తే తెలంగాణ): ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎం బీ) త్రిసభ్య కమిటీ సమావేశాన్ని మరో రోజు కు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి తాగు, సాగు అవసరాలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో ఈ నెల 21న త్రిస భ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని ఇటీవల కేఆర్ఎంబీ నిర్ణయించింది. కానీ, ఆ రో జున షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నందున సమావేశాన్ని మరో రోజుకు వాయిదా వేయాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీకి విజ్ఞప్తి చేశారు.