హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సింగరేణి కాలరీస్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ఆ సంస్థ యాజమాన్యం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఎన్నికలకు కేంద్ర కార్మిక శాఖ ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయడంతోపాటు షెడ్యూల్ను కూడా ప్రకటించిన నేపథ్యంలో మధ్యంతర పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై సోమవారం విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని గుర్తింపు కార్మిక సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.