Revanth Reddy | కంటోన్మెంట్, జూలై 28: ‘రేవంత్రెడ్డి కనబడుట లేదు’.. అనే పోస్టర్లు కంటోన్మెంట్ ప్రాంతంలో శుక్రవారం కలకలం రేపా యి. కార్ఖానాలోని విక్రంపురి బస్టాపులో ‘రేవంత్ మిస్సింగ్’ అంటూ పోస్టర్లు వెలిశాయి. వరుస వర్షాలతో నగరం అతలాకుతలమవుతుంటే ఎంపీ రేవంత్రెడ్డి ఎక్కడా పరామర్శించిన దాఖలాలు లేవని, 2020లో సైతం ఇలాగే వరదలతో నగరంలోని పలు ప్రాంతాలు మునిగిన సందర్భంలోనూ ఆయన కనిపించకుండా పోయారనే సందేశంతో పోస్టర్లు దర్శనమిచ్చాయి.
మల్కాజిగిరి నుంచి రేవంత్ గెలిచినప్పటికి ఏడాది కాలంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించడం లేదని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని పోస్టర్లలో పేర్కొన్నారు.