హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో బీజేపీ (BJP) చేస్తున్న బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొందరు నాయకులను పేర్కొంటూ నగర వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు. అయితే ఈడీ (ED), సీబీఐ (CBI) రైడ్స్ ముందు, తర్వాత ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఒకేలా ఉన్నారని, అసలైన రంగులు వెలసిపోవంటూ.. ఉద్యమనేతకు మద్దతు ప్రకటించారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా (Jyothi raditya Sindiya), అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himantha biswa sharma), పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి (Suvendu Adikari), ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త, ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణే ఐటీ, సీబీఐ రైడ్స్కు ముందు, తర్వాత రంగు మారినట్లు చూపించారు. తెలంగాణలో కవిత మాత్రం రైడ్స్కు ముందు, తర్వాత ఒకేలా ఉన్నారని.. అసలైన రంగులు వెలవంటూ పేర్కొన్నారు. చివర్లో బైబై మోదీ (#Bye Bye Modi) అంటూ హ్యాష్ టాగ్తో పోస్టర్లను అంటించారు. ఇప్పుడీ పోస్టర్లు నగరంలో ఆసక్తికరంగా మారాయి.