హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్: అభ్యర్థుల ప్రకటన దగ్గరపడుతున్నా కొద్దీ కాంగ్రెస్లో వర్గపోరు పెరుగుతున్నది. నిన్నమొన్నటి వరకు జిల్లాలకే పరిమితమైన వర్గపోరు ఇప్పుడు గాంధీభవన్కు పాకింది. ఆదివారం చిన్నారెడ్డికి వ్యతిరేకంగా వనపర్తి కార్యకర్తలు గాంధీభవన్లో వినపతిపత్రాలు అందజేయగా, తాజాగా మధుయాష్కీగౌడ్కు వ్యతిరేకంగా ఎల్బీనగర్ నియోజకవర్గ నేతలు పోస్టర్ల యుద్ధం ప్రారంభించారు.
‘మధుయాష్కీ గోబ్యాక్.. సేవ్ ఎల్బీనగర్’, ‘ప్యారాచూట్ నేతలకు టికెట్ ఇవ్వొద్దు’ అంటూ గాంధీభవన్ గోడలపై పోస్టర్లు అతికించారు. మధుయాష్కీగౌడ్ ప్యారాచూట్తో విమానం నుంచి ఎల్బీనగర్లో వాలిపోతున్నట్టుగా పోస్టర్లను ముద్రించారు.