పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలు, పుట్టపాక తేలియా రుమాల్ లోగోతో పోస్టల్ కవర్ ఆవిష్కరణ
బీబీనగర్(భూదాన్పోచంపల్లి), మే 13 : పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలు, పుట్టపాక తేలియా రుమాల్కు మరింత గుర్తింపు వచ్చేలా తపాలా శాఖ కృషి చేస్తున్నదని ఐపీఓఎస్ పోస్ట్మాస్టర్ జనరల్ పీ విద్యాసాగర్రెడ్డి అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని పోచంపల్లి చేనేత టై అండ్ డై సిల్క్ చీరల ఉత్పత్తిదారుల భవనంలో పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలు, పుట్టపాక తేలియా రుమాల్ లోగోతో రూపొందించిన రెండు వేర్వేరు పోస్టల్ కవర్లను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విద్యాసాగర్రెడ్డి మాట్లాడుతూ ఈ పోస్టల్ కవర్లతో చేనేత వస్ర్తాలకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందన్నారు. చేనేత వ్యాపారులు పంపించే వస్ర్తాలను పోస్టల్ శాఖ బాధ్యతగా చేరవేస్తున్నదని చెప్పారు. వీవర్స్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ చేనేత వస్ర్తాలను ఆన్లైన్లో కొనుగోలుకు త్వరలో ఇక్కత్ యాప్ను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత జాతీయ మాస్టర్ వీవర్ గజం గోవర్ధన్, నల్లగొండ పోస్టల్ సూపరింటెండెంట్ వెంకటసాయి, టై ఆండ్ డై అసోసియేషన్ సభ్యులు భారత లవకుమార్, పోస్టల్ సిబ్బంది, చేనేత కార్మికులు పాల్గొన్నారు