రాజన్న సిరిసిల్ల జిల్లా కనగర్తిలో పోస్ట్మ్యాన్ నిర్వాకం
కోనరావుపేట, జూలై 8: ఆరేండ్లుగా గ్రామానికి వస్తున్న ఉత్తరాలను బట్వాడా చేయకుండా ఇంట్లోనే ఉంచుకొన్నాడు ఓ పోస్ట్మ్యాన్. గ్రామస్థుల ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన పోస్టుమ్యాన్ వేణుగోపాల్ గ్రామంలోని పలువురికి వస్తున్న ఉత్తరాలను బట్వాడా చేయకుండా తన ఇంట్లోనే ఉంచుకొన్నాడు.
ఈ క్రమంలో కాల్లెటర్, ఇంట ర్వ్యూ లెటర్లు అందని వారు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టగా వేణుగోపాల్ ఇంట్లో 2016 నుంచి వచ్చిన ఉత్తరాలన్నీ ఉన్నాయి. వాటిలో ఆధార్కార్డులు, బ్యాంక్ ఏటీఎం కార్డులు, ఇతర పలు రకాల సంస్థల ఉత్తరాలు ఉన్నాయి. దీంతో అధికారులు అతడిని సస్పెండ్ చేశారు.