కరీంనగర్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ‘సార్.. కాంగ్రెస్ తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మా బతుకులు రోడ్డున పడ్డయ్. నాలుగు నెలల్లోనే 40 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నరు. మా గురించి కూడా పోరాడండి’ అని ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలను సావధానంగా విన్న కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పొలంబాట పర్యటనకు వచ్చిన కేసీఆర్ను మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఆటో కార్మిక సంక్షేమ సంఘం నాయకులు కలిసి వినతిపత్రం అందించారు. పదేండ్లపాటు మీ పాలనలో ఆటో కార్మికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతికామని తెలిపారు. కార్యక్రమంలో కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం నాయకులు బండారి సంపత్ పటేల్, మద్దెల రాజేందర్, నాగుల మహేందర్, టీఆర్ఎస్కేవీ నాయకులు శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.