హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : వేసవిలో ప్రయాణికుల కోసం రైల్వేస్టేషన్లలో వాటర్ కూలర్లు ఏర్పాటు చేసినట్టు శనివారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు. రైల్వే నెట్వర్క్ పరిధి వరకు ఉన్న రైల్వేస్టేషన్లలో పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఎస్సీఆర్ జోన్ ఆధ్వర్యంలో 170 రైల్వేస్టేషన్ల పరిధిలో మొత్తం 468 వాటర్ కూలర్లు ఏర్పాటుచేశామని తెలిపారు. జోనల్ రైల్వే, డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో ఆయా అధికారులు ఈ సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 24 గంటల పర్యవేక్షణతోపాటు స్టేషన్లలో అటోమోటిక్ వాటర్ సైప్లె సిస్టం కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.