సికింద్రాబాద్/మారేడ్పల్లి, మే 30 : హైదరాబాద్ ఆర్చ్ డయసిస్ బిషప్ పూల ఆంథోని కార్డినల్గా నియమితులయ్యారు. ఈ మేరకు వాటికన్లో పోప్ ఫ్రాన్సిస్ నుంచి అధికారికంగా ఆదేశాలు వచ్చినట్టు హైదరాబాద్ ఆర్చ్ డయసిస్ వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి.
పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ వ్యాప్తంగా 21 మందికి కార్డినల్ హోదా కల్పించగా, అందులో మన దేశం నుంచి అంథోని, గోవాకు చెందిన ఆర్చ్ బిషప్ ఫిలిప్ నెరి ఉన్నారు. ఆంథోని ఏపీలోని కర్నూల్ జిల్లా చిందుకూరు గ్రామానికి చెందినవారు. పలువురు చర్చి పాస్టర్లు, ఫాదర్లు ఆంథోనికి శుభాకాంక్షలు తెలిపారు.