ధర్మపురి(జగిత్యాల) : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని జల వనరులన్నీ జలకళతో కళకళలాడుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు. ధర్మపురి మండలం ధమ్మన్నపేట, బుద్దేశపల్లి, బుగ్గారం మండలం వెల్గొండ, గోపులపూర్ గ్రామాల్లో నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు . ఈ సందర్భంగా గ్రామాల్లో కట్ట మైసమ్మకు బోనాలను సమర్పించి సహపంక్తి భోజనాలు చేశారు.
మంత్రి మాట్లాడుతూ ..మిషన్ కాకతీయ(Mission Kakatiya) ద్వారా చేపట్టిన చెరువుల పునరుద్ధరణతో మండుటెండల్లో సైతం చెరువులు మత్తడులు దూకుతున్నాయని పేర్కొన్నారు.నీటి పారుదల రంగంలో రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. నీటి పారుదల రంగంలో చేపట్టిన కార్యక్రమాల ద్వారా చెరువులకు పునర్జీవం వచ్చిందని, దీంతో సాగు నీటి సమస్యను అధిగమించామని చెప్పారు.
రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయని అన్నా. చెరువులపై ఆధారపడ్డ మత్స్యకారులు, చెరువు కట్టపై ఈత చెట్లు నాటడం వల్ల గీత కార్మికుల ఆదాయం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.