హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల నియామక పరీక్షలు సోమవారం నుంచి ఈ నెల 8 వరకు ని ర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితారామచంద్రన్ తెలిపారు. సోమవారం సివిల్ ఇంజినీరింగ్, టానరీ(చర్మ సంబంధిత), జియాలజీ, ఫిజి క్స్ సబ్జెక్టులకు, 5న మెకానికల్ ఇంజినీరింగ్, కెమి స్ట్రీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్, 6న ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరిం గ్, ఫుట్వేర్ టెక్నాలజీ, లెటర్ ప్రెస్ ప్రింటింగ్ టె క్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఫుట్వేర్ టెక్నాలజీ, లెటర్ ప్రెస్ ప్రింటింగ్ టెక్నాలజీ, 7న ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, బయో మెడికల్ ఇంజినీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయని వివరించారు.
ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలుంటాయని పేర్కొన్నారు. మొత్తం 19 విభాగాల్లో 247 ఉద్యోగాలకు సీబీఆర్టీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఒక అభ్యర్థి రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే, తప్పనిసరిగా రెండు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.