హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలల్లో మంగళవారం స్పాట్ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇవాళ, రేపు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉండగా.. నేటి నుంచి ఈ నెల 13 వరకు వెబ్ ఆప్షన్లకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ నెల 16న తుదివిడత సీట్లు కేటాయించనున్నారు. ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో ఈ నెల 12 నుంచి ప్రక్రియ ప్రారంభంకానుండగా.. ఈ నెల 16న ఆయా కళాశాలల్లో ప్రవేశాల నిర్వహణ చేపట్టనున్నారు.