హైదరాబాద్ : తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 30న పాలిసెట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ను నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఏప్రిల్ రెండోవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. జూన్ 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పింది. రూ.100 ఆలస్య రుసుముతో జూన్ 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బోర్డు తెలిపింది. పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత ఫలితాలను ప్రకటించనున్నట్లు పేర్కొంది.