హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న న్యాయవాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని టీఆర్ఎస్ లీగల్సెల్ నాయకులు కోరారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఉద్యమంలో మమేకమైన న్యాయవాదులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని పేర్కొన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడాలేనివిధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో కోర్టులు పనిచేయని సమయంలో న్యాయవాదులకు రూ.25 కోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. సంక్షేమ నిధిని మరింత పెంచాలని, ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి అనుసంధానం చేసిన రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు గండ్ర మోహన్రావుకు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చెంగల్వ కల్యాణ్రావు అధ్యక్షత జరిగిన సమావేశంలో కొంతం గోవర్దన్రెడ్డి, పులిగారి గోవర్దన్రెడ్డి, జీ రాజేశ్వర్రావు, ఒద్యారపు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.