హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ఎత్తు, లాంగ్జంప్, షాట్పుట్, రన్నింగ్ అంశాల్లో క్వాలిఫై అర్హతను పెంచడంతో చాలామంది ఉద్యోగ అర్హతను కోల్పోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే ఈవెంట్స్ నిర్వహించాలని కోరారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. డిజిటల్ పద్ధతి ద్వారా ఎత్తు కొలవడంతో సాంకేతిక లోపం వల్ల పలువురు అభ్యర్థులు అర్హత కోల్పోతున్నారని పేర్కొన్నారు.