BRS | ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలంపై బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని ప్రధాన రహదారి డివైడర్ల పక్కన ‘బాకీ కార్డులు’తో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
అయితే అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్రావు పోలీసులతో మాట్లాడి వారిని అడ్డుకున్నారు.