హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ను పూర్తిచేసిన పోలీస్ ఉద్యోగాల నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ).. తాజాగా టెక్నికల్ ఎస్సై (ఐటీ, సీవో) ఏఎస్సై(ఎఫ్పీబీ) తుది రాత పరీక్ష తేదీని శనివారం ప్రకటించింది.
టెక్నికల్ ఎస్సై, ఏఎస్సై పోస్టులకు టెక్నికల్ పేపర్స్ రాత పరీక్షను ఈ నెల 11న నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అభ్యర్థులకు ఈ నెల 6 ఉదయం 8 నుంచి 9వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు వరకు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. హాల్టికెట్ డౌన్లోడ్ చేసేప్పుడు ఏదైనా సమస్య తలెత్తినట్లయితే support@tslprb.inకు మెయిల్, 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించవచ్చని పేరొన్నది. మిగిలిన రెండు పేపర్ల పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. వివరాలకు అభ్యర్థులు www.tslprb.in వెబ్సైట్ చూడాలని సూచించింది.