నాంపల్లి కోర్టులు, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్ను 10 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు సోమవారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్ కన్నయ్యలాల్.. కౌంటర్ దాఖలు చేయాలని రాధాకిషన్రావు తరఫు న్యాయవాదిని ఆదేశించారు.
తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. మరోవైపు ఫోన్ల ట్యాపింగ్ కేసుకు టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్లను జోడించేందుకు అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న కలిసి ఫోన్లను ట్యాప్ చేసినట్టు తేలిందని, దీనిపై ఆరా తీయాల్సి ఉన్నదని తెలిపారు. కాగా, భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ మంగళవారంతో ముగియనున్నది.