హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఓ కాలేజీ నుంచి తప్పించుకున్న ఓ ఐఐటీ విద్యార్థి జాడ ఎంతకూ చిక్కడంలేదు. దీంతో విశాఖ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 17న కాలేజీ నుంచి బయటకు వచ్చిన విద్యార్థి కార్తీక్ సికింద్రాబాద్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కి విశాఖ చేరాడు. కాలేజీ సిబ్బంది మిస్సింగ్ సమాచారాన్ని తల్లిదండ్రులకు ఇవ్వగా, సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. విశాఖ బీచ్రోడ్డులో కార్తీక్ ఉన్నట్టు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా తెలుసుకున్న పోలీసులు మూడు రోజులు వెతికినా జాడ లేదు. ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసేలోపే అక్కడి నుంచి మాయమవుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.