హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తేతెలంగాణ): తిరుమలలో ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ దుండగుడు విద్యుత్తు బస్సును ఎత్తుకెళ్లాడు. శనివారం రాత్రి చార్జింగ్ స్టేషన్ వద్ద బస్సుకు చార్జింగ్ పెట్టిన డ్రైవర్ బయటికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూడగా బస్సు కనిపించకపోవడంతో అధికారుల సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు జీపీఎస్ లొకేషన్ ఆధారంగా బస్సు జాడను గుర్తించారు. బస్సులో చార్జింగ్ అయిపోవడంతో దుండగుడు ఆదివారం తెల్లవారుజామున 3.53 గంటలకు నాయుడుపేట బైపాస్ రోడ్డులో వదిలి వెళ్లినట్టు తెలుస్తున్నది. కేసు దర్యాప్తును