మూసాపేట, ఏప్రిల్ 3: ఫోన్ల ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్రావుపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. సీఐ కృష్ణమోహన్ కథ నం ప్రకారం.. విజయనగర్ కాలనీలో నివసించే మునగపాటి సుదర్శన్, రాజు, విశ్వనాథ్ కలిసి గతంలో రూ.60 లక్షలతో వ్యా పారం చేశారు. ఆ వ్యాపారంలో రూ.35 లక్షల నష్టం రావడంతో అదనంగా రూ.5 లక్షలు ఇవ్వాలని రాజు, విశ్వనాథ్ డిమాం డ్ చేశారు.
అందుకు సుదర్శన్ నిరాకరించడంతో ఎస్ఆర్ నగర్ స్టేషన్లో అప్పటి డీసీపీ రాధాకిషన్రావుకు ఫిర్యాదు చేశా రు. ఆయన తనను సికింద్రాబాద్లోని టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టడంతోపాటు రూ.35 లక్షలు డిమాండ్ చేసినట్టు సుదర్శన్ ఇటీవల కూకట్పల్లి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రాధాకిషన్రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.