హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): మొయినాబాద్లో యువతి అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. మృతురాలిని పాతబస్తీ మల్లేపల్లికి చెందిన తహ్సీన్బేగంగా గుర్తించిన పోలీసులు.. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు తేల్చారు. రాజేంద్రనగర్ అదనపు డీసీపీ రష్మీ పెరుమాల్ కథనం ప్రకారం.. మెహిదీపట్నంలోని మదీనా కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన తహ్సీన్బేగం (22) కు తన క్లాస్మేట్ అయిన మరో యువతితో స్నేహం ఏర్పడింది. చాలా సన్నిహితంగా ఉండే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొన్ని రోజులుగా ఒకరికొకరు దూరంగా ఉంటున్నా రు. వీరు సన్నిహితంగా ఉండేందుకు కుటుంబీకులు అంగీకరించలేదు. దీంతో స్నేహితురాలి ఎడబాటును తట్టుకోలేని తహ్సీన్బేగం తనువు చాలించాలని నిర్ణయించుకున్నది. ఈ నెల 8న పెట్రోల్ కొనుగోలు చేసింది. అదే రోజు ఉద యం 11.30కు మల్లేపల్లి నుంచి మురాద్నగర్, హుమాయూన్నగర్ ప్రాంతాల్లోని స్నేహితుల వద్దకు వెళ్లింది. అనంతరం అదే ఆటోలో మొయినాబాద్ డ్రీమ్వ్యాలీకి చేరుకుని.. వెంట తెచ్చుకున్న పెట్రోల్ తో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది.