ఉప్పల్, నవంబర్ 22: ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాచారంలో రూ.కోటి 20 లక్షల నగదు పోలీసులకు పట్టుబడింది. హైదరాబాద్లోని హబ్సిగూడ నుంచి భువనగిరి వెళ్తున్న కారును నాచారం వద్ద పోలీసులు తనిఖీ చేయగా, భారీ మొత్తంలో నగదు బయటపడింది. కారు డోర్లలో దాచిపెట్టిన రూ.కోటి 20లక్షల నగదును పోలీసులు సీజ్ చేసి, కొత్తపేటకు చెందిన సుధీర్రెడ్డి, డ్రైవర్ శరత్ను అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపారు.