హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: ‘మహబూబ్నగర్ పోలీసులకు నేను చెప్పదలుచుకున్నా.. రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతం. 100 రోజుల తరువాత మా ప్రభుత్వం వచ్చినాక ఒక్కొకన్ని గుడ్డలిప్పదీస్తం. అసలు, మిత్తీతోని చెల్లిస్తం’ అని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు భగ్గుమన్నారు. ప్రజారక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న పోలీసులపై కాంగ్రెస్ నేత చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలపై నిరసన వ్యక్తంచేశారు. పోలీసుల మనోభావాలు దెబ్బతీసిన రేవంత్రెడ్డి.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు వంశీచంద్రెడ్డి, సంపత్కుమార్పై కేసులు నమోదయ్యాయి.
బాధ్యతాయుత పదవిలో ఉండి ఇవేం మాటలు: గోపిరెడ్డి
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి ఖండించారు. ‘తదుపరి ప్రభుత్వం మాదేనని, మీ సంగతి చూస్తామని’ బెదిరించడం ఎక్కడి రాజనీతి?. ‘రెడ్ డైరీ’ అంటే ఏమిటి? అదేమన్నా మీ సొంత రాజ్యాంగమా? అని రేవంత్ను ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ ప్రభుత్వంలో అంతర్భాగమని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శాంతి భద్రతలను కాపాడతామని స్పష్టంచేశారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను మీరు ఎర్ర డైరీలో ఎకిస్తే, ప్రజలు మిమ్మల్ని నల్ల డైరీల్లో ఎకిస్తారన్నారు. మీరు పోలీసు వ్యవస్థకు ఎన్నడూ మేలు చేయకపోగా, పోలీసుల ఆత్మగౌరవం దెబ్బదీసే విధంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వెం టనే రేవంత్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, పోలీసు వ్యవస్థకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.
పలు జిల్లాల్లో రేవంత్పై కేసులు
పోలీసులపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు భగ్గుమన్నారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీసిన రేవంత్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు రాచకొండ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణారెడ్డి తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గుణవర్ధన్ ఫిర్యాదు మేరకు పీసీసీ చీఫ్ రేవంత్, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి, కాంగ్రెస్ నేత సంపత్కుమార్పై నాగర్కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబ్నగర్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటయ్య ఫిర్యాదుతో మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్లో కేసులు నమోదయ్యాయి. రేవంత్ వ్యాఖ్యలను రామగుండం కమిషనరేట్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు బీ పోషలింగం ఖండించారు. రేవంత్పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు షకీల్ పాషా స్థానిక వన్టౌన్లో ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు ఆదిలాబాద్ వన్ టౌన్లో ఫిర్యాదు చేశారు.
సుమోటోగా కేసు నమోదు చేయాలి: బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్
పోలీసుల మానసిక ైస్థెర్యాన్ని, విద్యుక్త ధర్మాన్ని అవహేళన చేసిన రేవంత్పై సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కోరారు. రాజకీయ నైతికతను తుంగలో తొకి, పోలీసులపై బెదిరింపులకు పాల్పడుతూ రేవంత్ మానసిక రోగిగా మారిపోయాడని విమర్శించారు. అసాంఘిక నేరపూరిత వైఖరిని రేవంత్ ప్రదరిర్శిస్తున్నారని, ఇదే కాంగ్రెస్ పార్టీ విధానమా? అని ప్రశ్నించారు.