హైదరాబాద్ : బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ పబ్లో డ్రగ్స్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. డీజే ఆపరేటర్ వంశీధర్రావు, పబ్ నిర్వాహకుడు అభిషేక్, ఈవెంట్ మేనేజర్ అనిల్, వీఐపీ మూవ్మెంట్ను చూసే కునాల్ను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవాళ సినీ, రాజకీయ, వ్యాపార కుటుంబాలకు చెందిన యువతీ యువకులు డ్రగ్స్ సేవిస్తూ పార్టీలో చిందులేస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో వంద మందికిపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందరు డ్రగ్స్ సేవించి ఉంటారన్న అనుమానంతో రక్త నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. అనంతరం వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపారు. ఈ నేపథ్యంలోనే పట్టుబడిన వారిలో 142 మంది పేర్లను పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వారి ఇంటి అడ్రస్లు, ఫోన్ నంబర్లు సేకరించిన పోలీసులు అందరికీ నోటీసులు పంపారు.